Sunday, October 6, 2024
HomeతెలంగాణHuzurabad: మృతుల కుటుంబానికి అండగా ఉంటా

Huzurabad: మృతుల కుటుంబానికి అండగా ఉంటా

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ మండలం బోర్నపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మట్టి తీసుకొస్తున్న టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై బోల్తా పడిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు ముగ్గురు మృతి చెందగా, మృతుల కుటుంబ సభ్యులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోర్నపల్లికి చెందిన అన్నా-చెల్లెలు గంట విజయ్, వర్ష, సింధుజ తమ గ్రామ సమీపంలో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా మట్టితో టిప్పర్ లారీ అతివేగంగా వస్తున్న విషయాన్ని గమనించి రహదారి ప్రక్కన ద్విచక్ర వాహనాన్ని ఆపారు. అదే సమయంలో టిప్పర్ లారీ అదుపు తప్పి బోల్తాపడి అందులోని మట్టి ఒక్కసారిగా ముగ్గురిపై పడడంతో అన్నా చెల్లెలు మృతిచెందారు.

- Advertisement -

మృతదేహాలను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద కారులకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శీను, గందే శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News