Tuesday, September 17, 2024
HomeతెలంగాణThimmapur: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Thimmapur: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

మాజీ సర్పంచ్ పెద్ద మనసు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న ఖమ్మం తిరుపతి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా, తాజా మాజీ సర్పంచ్ బొజ్జ తిరుపతి మృతుడి కుటుంబ సభ్యులకు 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి భార్య ఖమ్మం నర్సవ్వ పేరిట ఫిక్స్ డిపాజిట్ చేసి, బాండ్ పేపర్ ను కుటుంబ సభ్యులకు అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బొజ్జ తిరుపతి మాట్లాడుతూ, ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఖమ్మం కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, వార్డు మాజీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News