Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కర్నూలు పార్లమెంటుకు మొదటి రోజు మూడు నామినేషన్లు

Kurnool: కర్నూలు పార్లమెంటుకు మొదటి రోజు మూడు నామినేషన్లు

జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. మొదటి రోజు కర్నూలు పార్లమెంటుకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కర్నూలు పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు, టిడిపి రెండవ అభ్యర్థిగా కె జయసుధ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీ బీచుపల్లి నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజును కే రామకృష్ణ బలపరిచారు. అలాగే టిడిపి రెండవ అభ్యర్థిగా కె జయసుధ నామినేషన్ ను కురువ పరమేష్ బలపరిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన టీ బీచుపల్లి కి పదిమంది అభ్యర్థులు బలపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ జి సృజన వివరాలను వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News