Thursday, September 19, 2024
Homeనేషనల్Parliament: దూకుడు ప్రసంగం..పార్లమెంట్ లో విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ

Parliament: దూకుడు ప్రసంగం..పార్లమెంట్ లో విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయని ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు గుమ్మరించారు. 2004-2014 మధ్య కాలం అంతా అన్ని రంగాలు కుభకోణాలమయంగా మారిందని నిప్పులు చెరిగిన మోడీ పదునైన మాటలతో కాంగ్రెస్ జమానాపై ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై సమాధానం ఇచ్చిన మోడీ చాలా సీరియస్ అంశాలను రేకెత్తారు.

- Advertisement -

నిర్మాణాత్మక విమర్శలను కట్టిపెట్టి కేవలం విమర్శించక తప్పని పరిస్థితుల్లో విమర్శలకు దిగుతూ, టీవీల్లో మెరిసిపోతున్నారని విపక్షంపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. హార్వర్డ్ యూనివర్సిటీ కాంగ్రెస్ ఉత్థాన-పతనాలపై ఆసక్తికరమైన అధ్యయనం చేసిందని రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. విపక్ష పార్టీలకు అధికార పక్షంపై ఉన్న అక్కసంతా ఈ ప్రసంగాల్లో వెళ్లగక్కారన్నారు. డిజిటల్ ఇండియా మనదేశం ఎదగటాన్ని యావత్ ప్రపంచం చూస్తోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News