Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Rapthadu: పర్వతదేవర పల్లిలో తోపుదుర్తి ప్రచారం

Rapthadu: పర్వతదేవర పల్లిలో తోపుదుర్తి ప్రచారం

కనగానపల్లి మండలంలో..

రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనగానపల్లి మండలం పర్వతదేవర పల్లి గ్రామంలో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News