Sunday, October 6, 2024
HomeతెలంగాణKalluru: రైతుబిడ్డ నామాని పార్లమెంట్ కి పంపిద్దాం

Kalluru: రైతుబిడ్డ నామాని పార్లమెంట్ కి పంపిద్దాం

బాకీపడ్డ కాంగ్రెస్ ని నిలదీయండి

లోకసభలో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించాలంటే ఖమ్మం జిల్లా రైతుబిడ్డ నామ నాగేశ్వరరావుని మీ పవిత్రమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మాయమాటలు పలికే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దని, గత 24 సంవత్సరాలుగా మీ మధ్యనే ఉంటూ మీ అందరి ఆదరణతో పార్లమెంటులో గళమెత్తిన ఏకైక గొంతుక నామా మాత్రమేనని అన్నారు.

- Advertisement -

మండల కేంద్రంలో అంబేద్కర్ మెయిన్ సెంటర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. నామా గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్తా గడప గడపకూ వెళ్లి ఓటును అడుగుతున్నారని, ఇంతటి అభిమానాన్ని అందించి ఖమ్మం జిల్లా బిడ్డగా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని తాపత్రయ పడుతున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి భారీ మోసాలకు పాల్పడిందని ఆరు గ్యారెంటీలలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, పెన్షన్ దారులకు ఏ ఒక్కరికి ఇచ్చిన హామీ నేటికీ నిలబెట్టుకోలేకపోయిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నదని అన్నారు.

ఐదు నెలలు బాకీబడ్డ కాంగ్రెస్ ను ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి ప్రదాత కెసిఆర్ కు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ గెలుపు బహుమతి గా ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు కల్లూరు జడ్పిటిసి కట్ట అజయ్ కుమార్ ఎంపీపీ బీ రవల్లి రఘు రైతు సమన్వయ కమిటీ చైర్మన్ లక్కినేని రఘు టిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షు పెడకంటిరామకృష్ణ మాజీ జెడ్పిటిసి మేకల కృష్ణ చెన్నూరు సొసైటీ మాజీ అధ్యక్షులు కాటమనేని వెంకటేశ్వరరావు మాజీ సర్పంచులు కళ్యాణపు కొండలరావు పెదబోయిన నారాయణరావు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News