Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: బివి విజయం కోసం భారీ రోడ్ షో

Nandavaram: బివి విజయం కోసం భారీ రోడ్ షో

బి.వి కుటుంబంతోనే గ్రామాభివృద్ధి

మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ రఘుమూర్తి స్వామి దంపతులు ఆధ్వర్యంలో గ్రామంలోని టిడిపి కార్యకర్తలు భారీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ పచ్చ జెండాలు చేతబట్టి గ్రామపురి వీధుల గుండా తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకవీడు, పేట గ్రామాల అభివృద్ధి బివి మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరిగిందన్నారు.

- Advertisement -

టిడిపి ప్రభుత్వంలోనే గ్రామానికి తాగునీటి సమస్య నిర్మూలనకు ప్రత్యేక ట్యాంకులు నిర్మించి గ్రామానికి మంచినీటి వసతి అందించమని అంతేకాకుండా శ్రీ గురు రాఘవేందర్ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామానికి సాగునీరు అందించిన ఘనత బివి కుటుంబానికి దక్కిందని, ఒకటి కాదు రెండు కాదు గ్రామంలోని ప్రతి అభివృద్ధి బి.వి కుటుంబం ద్వారానే జరిగిందని ప్రజలకు వివరించారు. కనకవీడు గ్రామంలోని అన్ని వర్గాల వారు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని, ఇదే ఉత్సాహంతో రేపటి రోజున జరుగు ఎన్నికలలో నియోజకవర్గ అభ్యర్థి బి.వి జయ నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి కురువ బస్తిపాటి నాగరాజుల సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News