Friday, October 18, 2024
HomeతెలంగాణSangareddy: 2400 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు

Sangareddy: 2400 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు

పెట్రోలింగ్ నిరంతరం సాగాల్సిందే

పార్లమెంటు ఎన్నికలకు సంభందించి DRC (డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్) ల నుండి EVMలు వివిధ పోల్లింగ్ సెంటర్లకు వెళ్లనున్న సందర్భంగా సంగారెడ్డి DRC సెంటర్, అంబేద్కర్ స్టేడియం, పటాన్ చెర్వు DRC సెంటర్, శ్రీ చైతన్య కాలేజ్ రుద్రారం, అందోల్ DRC సెంటర్, JNTUలను ఎస్పీ ప్రత్యక్షంగా సందర్శించారు.

- Advertisement -

EVMలతో పాటు ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ ఇస్తూ ఎన్నికల విధులలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశమున్న వెంటనే సంభందిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.

ఎట్టి పరిస్తితులల్లోనూ పోలింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లారాదని సిబ్బందికి సూచించారు. రూట్ మొబైలు అధికారులు తమతమ ఏరియాలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం పెట్రోలింగ్ చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News