Thursday, September 19, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: కుప్పకూలిన మహిళకు ప్రాణాలు కాపాడిన పోలీస్

Rajanna Sirisilla: కుప్పకూలిన మహిళకు ప్రాణాలు కాపాడిన పోలీస్

అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీనగర్ కు చెందిన చిలగాని అనూహ్య అనే మహిళ తన తండ్రి మరణ వార్త విని హార్ట్ ఎటాక్ తో కుప్పకూలింది. ఇంట్లో నుండి కేకలు వినబడడంతో, అక్కడే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గడ్డమీది శ్రీనివాస్ పరిస్థితిని గమనించి, గుండెపోటు వచ్చినట్లు గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఆ మహిళకు సిపిఆర్ చేసి, తన స్వంత వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాన్ని కాపాడాడు. కానిస్టేబుల్ చాకచక్యంతో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడటంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శభాష్ శ్రీను అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు, నేటిజన్ లు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News