Sunday, October 6, 2024
HomeతెలంగాణAssembly: అసెంబ్లీలో ప్రతిపక్షాలేరీ?

Assembly: అసెంబ్లీలో ప్రతిపక్షాలేరీ?

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన శాఖల పద్దులపై మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేకపోవడాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చైర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యల పట్ల ప్రతి పక్షాలకు చిత్త శుద్ది లేదని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారని, టైం ఇస్తే తమకు కావాల్సిన రాజకీయాలు మాట్లాడి వెళ్లి పోతున్నారు ఇది అన్యాయం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన బడ్జెట్ పద్దులపై మంత్రులు సమాధానం చెప్తుంటే ప్రతిపక్ష సభ్యులు లేక పోవడం బాధాకరం అన్నారు. స్పీకర్ వారిని పిలిచి మాట్లాడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News