Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

Garla: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

టీడీపీకి పూర్వ వైభవం తెద్దాం

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎంతో కృషి చేశారని తెదేపా మండల అధ్యక్షులు యల మ రెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు వచ్చిన నాయకుడు తారక రామారావు అని జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేశారని, సంక్షేమ పథకాలతో సమ సమాజ స్థాపన కోసం బాటలు వేశారన్నారు.

- Advertisement -

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమందరం నడుంసబిగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కత్తి సత్యం టౌన్ అధ్యక్షులు పిడ మర్తి రమేష్ మండల నాయకులు జితేందర్ అగర్వాల్ దశరద్ బిచ్చా యాకూబ్ కాసింబి నరసింహారావు డాక్టర్ రామారావు శివాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ షఫీ తాళ్లూరు శ్రీను వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News