Saturday, October 5, 2024
Homeనేషనల్Modi: మోడీతో స్టార్ హీరోస్ యశ్, రిషభ్ షెట్టీ, అయ్యో శ్రద్ధ

Modi: మోడీతో స్టార్ హీరోస్ యశ్, రిషభ్ షెట్టీ, అయ్యో శ్రద్ధ

ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లూయెన్సర్ గా6.88 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ను సంపాదించుకున్న స్టాండప్ కమెడియన్ అయ్యో శ్రద్ద ప్రధాని మోడీని కలిశారు. ఈమేరకు ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేశారు. బెంగళూరులో ఉంటున్న శ్రద్ధ పలు సామాజిక అంశాలు, టెక్ సెక్టర్ పై పలు విషయాలను చాలా సెటైరికల్ గా ఫన్నీగా యాక్ట్ చేసి నవ్వు తెప్పిస్తూనే ఆలోచింపచేస్తారు. లింక్డిన్లో ఈమెకు 83,000 మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. తనను చూడగానే ప్రధాని ‘అయ్యో’ అన్నారని ఆమె ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ప్రధానిని కలిసి ఫోటో దిగిన వారిలో కేజీఎఫ్ స్టార్ యశ్ , కాంతారా ఫేమ్ రిషభ్ షెట్టీ కూడా ఉన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను మోడీ ఈమధ్య తరచూ కలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News