కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసామని సీఎం రేవంత్ వెల్లడించారు. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామని, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని రేవంత్ వెల్లడించారు.
రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామని, రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు సీఎం. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని, నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యమన్న సీఎం రేవంత్.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/23c23426-7b77-4069-8fa3-4249ab5cf50b-1024x515.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/76e09f65-6272-4a46-9e26-d4833e085a64-1024x783.jpg)