Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్4 News channels: ఏపీలో ఆ నాలుగు న్యూస్ ఛానెల్స్ పునరుద్ధరించండి

4 News channels: ఏపీలో ఆ నాలుగు న్యూస్ ఛానెల్స్ పునరుద్ధరించండి

ఏపీలో నాలుగు తెలుగు న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ కేబుల్‌ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హర్షం వ్యక్తంచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను బలోపేతం చేసే చర్యగా, మీడియా స్వేఛ్చను పరిరక్షించే తీర్పుగా దీన్ని భావిస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు తీర్పును సహృదయంతో అర్థంచేసుకుని నిలిపేసిన న్యూస్‌ఛానళ్ల ప్రసారాలను తిరిగి ప్రారంభించాలని కేబుల్‌ ఆపరేటర్లకు విజ్ఞప్తిచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంటుందని, ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా వాటిని గౌరవించనట్టే అవుతుందని తెలియజేసుకుంటున్నాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News