మంత్రి పొన్నం ప్రభాకర్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ కుంభకోణంలో మంత్రి 100 కోట్ల స్కామ్ చేయలేదా అని నిలదీశారు. మంత్రి పొన్నం ఓ ఆవేశం స్టార్ అని కామెంట్ చేసిన కౌశిక్..మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం పేరు చెప్పి కోట్ల రూపాయల టికెట్ స్కాం చేయలేదా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవన్నీ చేయలేదని శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసే దమ్ము పొన్నంకు ఉందా అని ప్రశ్నించారు. ఆ దమ్ము లేకనే గుడికి రాలేదని భగ్గుమన్నారు కౌశిక్.
- Advertisement -
“ప్రభాకర్ అక్రమంగా డబ్బు తింటూ ఎందుకు వస్తాడు ప్రమాణానికి రాడు ఈ రోజు అక్రమంగా డబ్బులు దోచుకుంటూ తెలంగాణ ప్రజల పైసలు ఆంబోతులా తింటున్నావ్” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/3d3fb852-e9c5-4087-a6dd-6688118599a0-1024x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/7cdc152f-cddf-461d-bb23-f3277ed86945-818x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/87d82472-4b00-4e61-ae9e-0784e7a5154e-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/55291cff-3aa7-4b06-8dda-bbefd41e0a90-767x1024.jpg)