Monday, October 14, 2024
HomeతెలంగాణManchiryala: ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆశాల ధర్నా

Manchiryala: ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆశాల ధర్నా

ఆశాలకు పెట్టె పరీక్షను రద్దు చేయాలి

ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు)రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆశా వర్కర్స్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్.శోభ ఆశా యూనియన్ జిల్లా  కార్యదర్శి మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ గత 19 సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పని భారంతో కాలమెల్లదిస్తున్నారు.

- Advertisement -

గత శాసనసభ ఎన్నికలకు ముందు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చాలేదు. మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయడం లేదు. పద్మ, విజయలక్ష్మి, సరోజ ఆశా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు  నెరవేర్చి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత సౌకర్యలు కల్పించాలని, ఇన్సూరెన్స్ 50 లక్షలు, పెన్షన్ రూ.10వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం 5 లక్షలు, రిజిస్టర్ బుక్కులు , యూనిఫామ్స్, గతంలో పెరిగిన జీతాల ఏరియర్స్, లెప్రసీ, పోలియో టీకా, ఎలక్షన్ డ్యూటీ బిల్లులు, ఎగ్జామ్స్ సందర్బంగా పని చేసిన బిల్లులు, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ CITU జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఆశాల సమస్యలు పరిష్కరించడంలో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని. ఆశలకు నష్టం కలిగించే పరీక్షను రద్దు చేయాలని, ఆశల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశాల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి, హైమావతి మమతా, గురులష్మి, కవిత, భారతి, ఉదయ, గీత, పద్మ, శారదా, లలిత, సుజాత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News