Friday, October 18, 2024
HomeNewsRajanna Sirisilla: బడి పంతులు అయిన కలెక్టర్

Rajanna Sirisilla: బడి పంతులు అయిన కలెక్టర్

స్కూల్ లో కలెక్టర్ గారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు భోదించే క్రమంలో బోర్డుపై రాస్తూ, పాఠాలు బోధించి వారి యొక్క అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు.

- Advertisement -

చుదువుతో పాటు ఆటల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటూ భోజనశాలను స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాల్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News