Thursday, September 19, 2024
HomeతెలంగాణRamadugu: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారిస్తాం

Ramadugu: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారిస్తాం

జర్నలిస్టులూ.. మీ సమస్యలు మా దృష్టికి తెండి..

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని టియుడబ్ల్యూజే (ఐజేయు) కరీంనగర్ జిల్లా కన్వీనర్ నగునూరి శేఖర్ అన్నారు. రామడుగు మండలానికి చెందిన జర్నలిస్టుల జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోల్లె రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కార్యవర్గాన్ని ప్రెస్ క్లబ్ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నగునూరి శేఖర్ మాట్లాడుతూ… రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టామని, మండలానికి చెందిన వర్కింగ్ జర్నలిస్టులు జిల్లా సభ్యత్వ నమోదును తీసుకోవాలని కోరారు.

- Advertisement -

మండలంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, నివేశణా స్థలాల గురించి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఐజేయు సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్న జర్నలిస్టులు సంఘం నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు. మన సంఘం ఏ ఒక్క పార్టీకి మద్దతుగా నిలవదని, అన్ని రాజకీయ పార్టీలకు సమ ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు తాము చేస్తున్న వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వనర్ గాండ్ల శ్రీనివాస్ , రవీందర్, వంచ రాజిరెడ్డి, కాసారపు తిరుపతి గౌడ్, రహెమత్, పంజాల వెంకటేష్ గౌడ్, పూరెళ్ళ రవీందర్, దొడ్ల శ్రీనివాస్ గౌడ్, పన్యల అశోక్ రెడ్డి, ఏజ్రా మల్లేశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News