Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: స్వచ్ఛదనం-పచ్చదనంలో అందరూ భాగం కావాలి

Chegunta: స్వచ్ఛదనం-పచ్చదనంలో అందరూ భాగం కావాలి

ప్రత్యేక అధికారి మడిగెల శ్రీశైలం

చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని రెడ్డి పల్లి మండల ప్రత్యేక అధికారి మడిగెల శ్రీశైలం కోరారు రెండవ రోజు మంగళవారం రెడ్డిపల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ నిర్వహించారు. అధికారులు ఉద్యోగులు విద్యార్థులు భారీగా ఈ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛదనం-పచ్చదనంపై నినాదాలు చేశారు. గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటి, అధికారులు నీళ్లు పోశారు.

- Advertisement -

అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మడిగెల శ్రీశైలం మాట్లాడుతూ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు నిర్ణయించిన కార్యక్రమాలతో నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ స్కూలు ప్రాంగణంలో పిచ్చి మొక్కలు తీసివేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ సమీనా సుల్తానా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవాజ్ సురేష్ రామకృష్ణ అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News