Friday, September 20, 2024
HomeఆటBethamcharla: బేతంచెర్ల విద్యార్థులకు బంగారు పతకాలు

Bethamcharla: బేతంచెర్ల విద్యార్థులకు బంగారు పతకాలు

ఆగస్టు 10- 11 వ తేదీలలో శని, ఆది వారాలలో తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆమోచ్యుర్ థైక్వాండో సంఘం నిర్వహించిన 9th ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ ఓపెన్ థైక్వాండో చాంపియన్ షిప్ పోటీలలో కర్నూల్ & నంద్యాల జిల్లాల తరుపున బేతంచెర్ల విద్యార్తిని, విద్యార్థులు క్విడ్స్, సబ్ జూనియర్స్, కోడేట్ విభాగాలలో పాల్గొని బంగారు, వెండి, కాంశ్యము పథకములు గెలుపొందారని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆమోచ్యుర్ తైక్వాండో సంఘం జిల్లా సెక్రెటరీ (3 ర్డ్ డాన్ బ్లాక్ బెల్ట్ ) బి.వెంకటేశ్వర్లు కోచ్ నాగన్న (1స్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ )తెలిపారు.స్థానిక శేషారెడ్డి హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో విద్యార్ధిని, విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ ను కోచ్ నాగన్న అందజేశారు.

- Advertisement -

ఇందులో కిడ్స్ విభాగంలో అండర్ 16 కేజీల విభాగంలో ఎస్.జయ ప్రతిక్ గోల్డ్ మెడల్ ను సాధించారు. అలాగే సబ్ జూనియర్ విభాగంలో ఎన్. అమృత (డి /ఓ.తెలుగుదేశం పార్టీ ఎస్టి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవీంద్ర నాయక్ ) గోల్డ్ మెడల్ ను సాధించారు. కోడెట్ విభాగంలో కె. మనస్విని గోల్డ్ మెడల్ ను, సబ్ జూనియర్ బాయ్స్ అండర్ 38 కేజీల విభాగంలో వి. పూర్నెంద్ర వెండి పథకమును, బి ఉత్తేజ్ కుమార్ బ్రోంజే మెడల్స్,ఎన్. దివ్యశ్రీ బంగారు పథకంను సాధించారు. బహుమతులు గెలిచిన వారందరికీ సభలో అభినందనములు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News