Tuesday, September 17, 2024
HomeతెలంగాణManakonduru: రారైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునిగా తిరుపతి గౌడ్

Manakonduru: రారైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునిగా తిరుపతి గౌడ్

కరీంనగర్ జిల్లా రారైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునిగా మానకొండూర్ మండలం చెంజర్ల రారైస్ మిల్లు యజమాని, కాంగ్రెస్ నాయకులు సుదగోని తిరుపతి గౌడ్ ఎన్నికయ్యారు. రారైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో తిరుపతి గౌడ్ ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు తిరుపతి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న నమ్మకంతో ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జిల్లాలో రారైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తిరుపతి గౌడ్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News