Friday, September 20, 2024
HomeదైవంMantralayam: రాఘవేంద్రస్వామికి టీటీడి పట్టువస్త్రాలు

Mantralayam: రాఘవేంద్రస్వామికి టీటీడి పట్టువస్త్రాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి 353 ఆరాధన ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా టీటీడి దేవస్థానం నుంచి వేంకటేశ్వర స్వామీ పట్టువస్త్రాలు టీటీడి దేవస్థానం ఈ వో శ్యామల రావు, అధికారులు సమర్పించారు.

- Advertisement -

పట్టువస్త్రాలు, ప్రసాదాలతో వచ్చినా ఆలయ అధికారులకు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు, అధికారాలు ఘంగంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, వాయిద్యాలు, పూర్ణ కుంభంతో స్వాగతించారు. వస్త్రాలు, ప్రసాదాన్ని టీటీడి దేవస్థానం అధికారులు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులకు అందజేశారు. వాటిని రాఘవేంద్ర స్వామి బృందావనానికి సమర్పించారు. అనంతరం టీటీడి దేవస్థానం అధికారులు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను ఘనంగా సత్కరించారు.

అధికారులను పీఠాధిపతి సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు ఏ ఏ ఓ మాధవ శెట్టి, మేనేజర్ ఎస్ కె శ్రీనివాస రావు, పీ ఆర్ వో ఐ పీ నరసింహ మూర్తి, శ్రీపతి ఆచార్, వ్యాసరాజాచర్, బిందూ మాధవ్ తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News