Thursday, September 19, 2024
HomeNewsMallapur: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Mallapur: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మల్లాపూర్ మండల వైద్యాధికారినీ డా. వాహిని

ముత్యంపేట, కొత్త ధాం రాజ్ పల్లి గ్రామాలలో మండల వైద్యాధికారి నీ డాక్టర్ వాహిని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలు నిర్వహించగా 23 మందిని జ్వర పీడితులుగా గుర్తించారు. డెంగ్యూ జ్వరం వచ్చిన వారి ఇళ్లను ఎంపిడిఓ రాజేందర్ రెడ్డి తొ కలసి పరిశీలించారు. నీటి నిలువ ఉన్న వాటిని తొలగించి, డెంగ్యూ కేసులు నమోదు అయ్యిన ఇళ్లలో స్ప్రే చేయించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ వాహిని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజేందర్ రెడ్డి , ఎంపిఓ జగదీష్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు మోబిన్, వంశీధర్ రెడ్డి,ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్ పిలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News