Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Thota Chandrasekhar: 150 kg కేక్ తో AP BRS చీఫ్ బర్త్ డే

Thota Chandrasekhar: 150 kg కేక్ తో AP BRS చీఫ్ బర్త్ డే

బీఆర్ఎస్ విధానాల్ని ఏపీలో అమలు చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ బీఆర్ఎస్ నేతలు కుండబద్దలు కొట్టి చెప్పారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని తోట చంద్రశేఖర్ నివాసం, బీఆర్ఎస్ పార్టీ ఏపీ క్యాంప్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆయనకు బీఆర్ఎస్ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ది మ్యాన్ విత్ మిషన్గా పేరుగాంచిన తోట చంద్రశేఖర్ కి భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ బాధ్యతలు అప్పగించడం వెనుక పటిష్టమైన ప్రణాళిక ఉందని క్రమక్రమంగా ఏపీ ప్రజలు బీఆర్ఎస్ వైపు మరలుతున్నారని వక్తలు కొనియాడారు.

- Advertisement -

హైదరాబాద్లోని తోట చంద్రశేఖర్ నివాసం వద్ద ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. పలువురు నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ను తయారు చేయించి డాక్టర్ తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, సినీ రచయిత చిన్ని కృష్ణతో పాటు పలువురు నాయకులతో కలిసి 150 కిలోల భారీ కేక్ ని తోట చంద్రశేఖర్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులకు తినిపించారు. బి ఆర్ ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. మేళ తాళాలు, బాణాసంచా నడుమ ఊరేగింపుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తోట చంద్రశేఖర్ ని గజమాలలు, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏపీలో భారాస కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా టిడిపి, వైసిపి ప్రభుత్వాల అసమర్ధ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టి ప్రత్యామ్యాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణాలో జరుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ వర్గాల వారు బిఆర్ఎస్ లో చేరుతున్నారని పునరుద్ఘాటించారు.

ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణా నమూనాని ఏపీలో అమలు చేసే సమర్ధత డాక్టర్ తోట చంద్రశేఖర్ కి మాత్రమే ఉందని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణా మోడల్ అభివృద్ధి ఎపిలో విస్తరించాలంటే ఏపి లో కేసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ పార్టి బలమైన రాజకీయ శక్తిగా ప్రజా సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ని విస్తరించేక్రమంలో దైవ సంకల్పం కూడా తోడు కావాలని డాక్టర్ తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక హోమాన్ని కూడా నిర్వహించారు. తోట చంద్రశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించింది. కొవ్వూరు నుండి టి.నాగరాజు, నెల్లూరు నుండి సురేష్, చంద్రా రెడ్డి , నాగరాజు, షేక్ ముజీబ్,తిరుపతి నుండి ధనుంజయ రాజు, సైదాపురం నుండి మల్లిఖార్జున్, రాజంపేట నుండి పునీత్ ,కిషోర్ రెడ్డి , శ్రీను ,జాకీర్ ,త్రినాద్,కిరణ్ , హేమంత్ ,అభినయ్,గుడివాడ నుండి సాయి తదితరులు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News