Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Katasani: వైసీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Katasani: వైసీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరించిన కాటసాని

పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. పరిధిలోని, కల్లూరు అర్బన్:35 వ వార్డులోని 91 వ సచివాలయం:మాధిరాజు నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్యెల్యే కాలనీలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు.
ఈకార్యక్రమంలో…స్థానిక వార్డ్ కార్పొరేటర్ సాపురు మాధురి, సాపురు వీరయ్య, కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్ సాన శ్రీనివాసులు, కార్పొరేటర్లు…సంగాల సుదర్శన్ రెడ్డి, దండు లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, తిరుపాల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి మిడుతురు శ్రీనివాసులు యాదవ్,35 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకు ఇంకా నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News