AP AIS Officers Transfer: ఏపీలో 31మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పనిచేస్తున్న 31 మంది అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీతో ప్రభుత్వ పాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ బదిలీల్లో భాగంగా పలువురు సీనియర్ అధికారులకు ప్రభుత్వం ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మనజీర్ జిలానీ సామున్ను ప్రభుత్వం నియమించింది. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చక్రధర్ బాబు, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్, ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించనున్నారు. పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్గా ఎస్. ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్గా పి. రంజిత్ బాషా, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్గా అరుణ్ బాబుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త జాయింట్ కలెక్టర్లు వీరే..
నంద్యాల జాయింట్ కలెక్టర్గా కొల్లాబత్తుల కార్తీక్, ఏలూరుకు అభిషేక్ గౌడ, కర్నూలుకి నూరుల్, కాకినాడ జేసీగా అపూర్వ భరత్, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్, బాపట్లకు ఎస్ఎస్ భావన, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా తిరుమణి శ్రీపూజ బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా రాహుల్ మీనా, పరిశ్రమల శాఖ డైరెక్టర్గా శుభమ్ బన్సల్, సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శిగా టీఎస్ చేతన్, హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు – సీసీఏల్ఏ కార్యదర్శిగా జేవీ మురళి, గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కొమ్మిశెట్టి మురళీధర్, లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ప్రసన్న వెంకటేశ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్గా బి. నవ్య, ఎస్. భరణి స్టెప్ కమిషనర్గా, ప్రవీణ్ ఆదిత్య ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, కేఎల్ విశ్వనాథన్ ఐ అండ్ పీఆర్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా గోవిందరావు, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా ఎస్. చినరాముడు, జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఏపీ ట్రాన్స్కో జేఎండీగా, సి. విష్ణుచరణ్ – సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా, ఎస్ఎస్ శోభిక వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి, అభిషేక్ కుమార్ను ఏపీ మారిటైం బోర్డు సీఈవోగా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


