Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AndhraPradesh: ఘోర ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి!

AndhraPradesh: ఘోర ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి!

AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో 16 మందికి గాయాలయ్యాయి. అందులో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యప్ప భక్తులంతా టాటా ఎస్ ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 23 మంది ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను తెనాలి ఆసుపత్రికి తరలించగా మృతులంతా కృష్ణా జిల్లా నిలపూడి వాసులుగా గుర్తించారు. వేమూరు మండలం జంపని వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా.. ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియదు కానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News