Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Actor Suman: హిందువులకు రక్షణ లేకుండా పోయింది.. సుమన్ కీలక వ్యాఖ్యలు

Actor Suman: హిందువులకు రక్షణ లేకుండా పోయింది.. సుమన్ కీలక వ్యాఖ్యలు

Actor Suman| ప్రస్తుతం దేశంలో సనాతన ధర్మం గురించి తీవ్ర చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawankalyan) అయితే ఏకంగా సనాతన ధర్మం రక్షణ బోర్డు ఏర్పాటుచేయాలని సూచించారు. దీంతో సోషల్ మీడియాలో సనాతన ధర్మం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. హిందువుల సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇతరుల మతాలు గౌరవిస్తూనే తమ మతాన్ని రక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ వేరు..సనాతన ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుల రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని.. ప్రతి మతం రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్ తీసుకుని రావాలన్నారు. తాను ఒక్క హిందువులకే సపోర్టు చేయడం లేదని అందరూ తనను ఆదరిస్తేనే ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు. దీంతో సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad