Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట

Allagadda: జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట

ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మావీధిలో శ్రీ కాశీ భట్ల మల్లిఖార్జున శాస్త్రి ఇంటి ఆవరణలో యోగి శ్రీ కాశీభట్ల మల్లిఖార్జున ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ వీరశంకర భారతి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి ప్రవచన తదితర అంశాలపై స్వామి ప్రసంగించారు. అనంతరం పీఠాధిపతి నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి లకు శుభాశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో, రిటైర్డ్ జిల్లా జడ్జి శివప్రసాద్ ,ఆళ్ళగడ్డ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వైఎస్సార్సీపీ నాయకులు గోపవరం నర్సింహా రెడ్డి , ఆళ్ళగడ్డ పట్టణ కన్వీనర్ గొట్లురు సుధాకర్ రెడ్డి , గంగుల రామిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త టీఎంసీ వేణుగోపాల్ ఆళ్ళగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టి వినోద్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News