Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: ప్రజలంతా జగన్ వైపే: గంగుల

Allagadda: ప్రజలంతా జగన్ వైపే: గంగుల

ఒక మంచి పని చేస్తే ప్రజలకు జీవితాంతం గుర్తుండే విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే దేశంలోనే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డే అని ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గంగులతో పాటు విజయ మిల్క్ డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, ఎంపీపీలు గజ్జల రాఘవేంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వసీం కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, వైయస్సార్ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి వైసీపీ నాయకులు గంగుల రామిరెడ్డి సింగం వెంకటేశ్వర్ రెడ్డి వైస్ చైర్మన్ నాయిబ్ రసూల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఎమ్మెల్యే కార్యాలయం నుండి కోర్టు, నాలుగు రోడ్ల కూడలి మీదుగా టీబి రోడ్డు పాత బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాలుగు కూడలి రోడ్ల సెంటర్లో, సి ఎస్ ఐ చర్చి దగ్గర దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ..ఈరోజు ఇంత పెద్ద యెత్తున బైక్ ర్యాలీనీ నిర్వహించడానికి గల కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవిని అలంకరించి నాలుగు సంవత్సరాలు పూర్తి ఆయన సందర్భంగా ఈ నాలుగేళ్లలో పేద ప్రజలకు చేసిన సంక్షేమ,అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళడమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు అంతే కానీ ఈ ర్యాలీలను,ప్రెస్ మీట్లను అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులను దూషిచడం తమ పని కాదని ఎమ్మెల్యే గంగుల తెలిపారు ఆదివారం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవారికి 50వేల కుటుంబాలకు ఇంటి స్థలాలు సంబంధించి పట్టాలు ఇవ్వడం ఒక గొప్ప కార్యక్రమం చేయడం జరిగిందన్నారు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏ చేసిందని గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పైకి ర్యాలీ చేశామన్నారు మేము ఎక్కడ ఎవరిని విమర్శించడానికి గాని దూషించడానికి గాని ప్రెస్మీట్లో ర్యాలీలు ఇవి మా పార్టీ కార్యక్రమాలకు వాడమన్నారు కేవలం ప్రజలకు జరుగుతున్న మేలు చెప్పడానికి మాత్రమే ప్రజలకు ఏం చేశామని ఈ నాలుగేళ్లలో చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు 50వేలకుటుంబాలకు ఏనాడు సొంత ఇంటి కల జీవితంలో నెరవేరుతుందా లేదా అన్నవారికి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే అన్నారు ఒక సెంటు స్థలం వారికిచ్చి వారి కల నెరవేర్చారన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంటు స్థలం సమాధులు కట్టుకోవడానికి పనికొస్తాయి అన్నారు అలాగే స్మశాన వాటికకు పనికొస్తాయి అన్నారు పేదరికం సమాధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారా పేదవాళ్లు ఆశలు తీరకుండా సమాధి చేయాలని మీ ఆలోచన స్పష్టంగా కనిపిస్తుందన్నారు రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు మా వెంట ఉన్నారు మంచి చేశాము మీకు మేలు జరుగుతేనే మా వెంట ఉండండి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరని ఆయనే జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రతి ఇంటికి గడపగడపకు వెళ్లి చూస్తుంటే 95 శాతం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు వారందరికీ మేలు జరిగిందన్నారు ప్రజల ఆశీర్వాదమే శ్రీరామరక్షగా భావిస్తున్నామన్నారు , వైఎస్సార్సీపీ నాయకులు డాబా మనోహర్ రెడ్డి , గుత్తి రంగయ్య యాదవ్ కొండపల్లి శేఖర్ రెడ్డి మాదం చెన్నయ్య , కోఆప్షన్ సభ్యులు రమేష్ గౌడ్, కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News