Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: ఘనంగా భూమా శోభనాగిరెడ్డి వర్ధంతి

Allagadda: ఘనంగా భూమా శోభనాగిరెడ్డి వర్ధంతి

దివంగత భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి ఘనంగా జరిగాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా ఘాటు వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ నాయుడు దంపతులు, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన వంటెల జై బాలవికలాంగుడి కి ట్రై సైకిల్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి భూమా దంపతులు బాట వేశారని అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారని వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా అదే బాటలో పయనిస్తూ పనిచేస్తామని వారి ఆశయాలను ఒమ్ము చేయకుండా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ భాష నాగాంజనేయులు మాజీ జెడ్పిటిసి చాంద్బాషా కాంట్రాక్టర్ నన్నే బాయ్ గారి జిలాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News