Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు: భూమా కిషోర్ రెడ్డి

Allagadda: నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు: భూమా కిషోర్ రెడ్డి

తన బాబాయ్ భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డిపై ఉన్న అభిమానంతో ఇంతవరకు అన్ని సహిస్తూ వచ్చామని ఎవరు ఎలాంటి వారో నియోజకవర్గాన్ని అంతా తెలుసునని, మా భూమా కుటుంబం కొన్ని కారణాల వల్ల 2004లో గంగులతో కలిసిందని భూమా కిషోర్ రెడ్డి అన్నారు. భూమా కిషోర్ రెడ్డి కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ నాయుడు, విఖ్యాత్ రెడ్డిలపై ఆయన విమర్శిలకు దిగారు. వారి స్వార్థ రాజకీయాల కోసం ఎన్నెన్నో మాట్లాడుతున్నారన్నారని ఆరోపించారు.

- Advertisement -

ఎవరి సొమ్ము ఆశించి తీసుకోలేదని మా తండ్రి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన ఆస్తులు మాత్రం నేను ఖర్చు పెడుతున్నానని ఆయన అన్నారు. వారి ఆస్తులన్నీ వారిపైనే ఉన్నాయన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులు భార్గవ్ రాం నాయుడు, విఖ్వాత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోము అంతు చూస్తాం అంటున్నారని ఆయన మండిపడ్డారు.  కమీషన్ల కోసం కార్యకర్తల రక్తం తాగుతున్నారన్నారన్నారు.  చివరికి బంధువులను కూడా వదలడం లేదని, బాచాపురం శేఖర్ రెడ్డి ఆయనపై దొంగ కేసులు పెట్టి మూడు కోట్లకు ఫోర్జరీ సంతకాలు చేసి కేసులు పెట్టింది మీరు కాదా అన్నారు.

విఖ్వాత్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు కురిపించారు. ఈ కార్యక్రమంలో అంబటి మహేశ్వర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి శంకర్ రెడ్డి భూమా వీరభద్ర రెడ్డి సర్వాయిపల్లి రాజా అన్ని మండలాల భూమా కిషోర్ రెడ్డి అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News