Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: జగనన్న ప్రజాసేవను దృష్టిలో ఉంచుకొని ఆదరించండి

Allagadda: జగనన్న ప్రజాసేవను దృష్టిలో ఉంచుకొని ఆదరించండి

రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సేవాకృషిని గమనించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి తోపాటు ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి విజయ మిల్క్ డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి వైస్ ఎంపీపీ నాసారి లక్ష్మీనరసింహ ప్రసాద్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నా సారీ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ సల్లా మధు ,గంగుల రామిరెడ్డి లతో కలిసి పాల్గొన్నారు ప్రతి గడపగడపకు వెళ్లి ఇంటిలోని వారందరినీ యోగక్షేమలు అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకుని వాటి వివరాలను తెలుపుతూ ఇంకా సంక్షేమ పథకాలు అందరి వారు ఉంటే తెలపాలని లేనివారు అధికారులకు తెలపాలని సూచించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలానికి 5 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం పూర్తి చేశామన్నారు మరో 3కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ ముందుకు సాగుతుంటే ప్రతిపక్షాలు లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు . నాటి నుండి నేటి వరకు మా గంగుల కుటుంబమే అహోబిలాన్ని అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తామన్నారు మాటల్లో కాదు పనుల్లో అభివృద్ధిలో చేసి చూపిస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో ఈ సంక్షేమాభివృద్ది ప్రజలు గొప్ప మెజారిటీతో మళ్ళీపట్టం కట్టి ప్రతిపక్షాల నోళ్ళు మూపించలని ప్రజలను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణ సీఐ జీవన్ గంగనాద్ బాబు ఎస్సై తిరుపాలు అహోబిలం సర్పంచ్ నా సారి వీరమ్మ, వైసీపీ నాయకులు రామచంద్రుడు వెంకటసుబ్బయ్య.. ఆళ్ళగడ్డ నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ దోరకొట్టల నాగార్జున రెడ్డి గారు..పలువురు అహోబిలం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News