Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

Allagadda: టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

వైసీపీ నుంచి 15 ఫ్యామిలీలు

ఆళ్లగడ్డలో టీడీపీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు టీడీపీలో చేరుతుండం ఆళ్లగడ్డ టీడీపీలో నయా ఉత్సాహం నింపుతోంది. పట్టణంలోని ఆచారి కాలనీకి చెందిన కత్తి శ్రావణి, వెంకటేశ్వరరెడ్డి, బ్రాహ్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, గౌతమ్ కౌశిక్ వారితో 15 కుటుంబాలు వైస్సార్సీపీ ని వీడి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ , టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్వాత రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ లో చేరారు. చేరిన వారందరికీ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ప్రభుత్వంపై విసిగెఎత్తి టిడిపిలో చేరారని వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, టిడిపి నాయకులు ఆచారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News