Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి రావాలి

Allagadda: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి రావాలి

ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. గత నాలుగు రోజుల నుండి నారా లోకేష్ తో పాటు ముమ్మరంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు అఖిలప్రియ. ఈ సందర్భంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర చూసి వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైంది, రాష్ట్ర బాగుపడాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని నిత్యావసర వస్తువులు ఆకాశానికి చేరాయని, అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారన్నారు. రాబోయేది టిడిపి పార్టీనేనన్న ఆమె.. ప్రజల కష్టాలు తీరతాయని అఖిలప్రియ భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News