Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: జగన్ ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి?

Allagadda: జగన్ ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని టిడ్కో గృహాలను ఆమె సందర్శించారు. అక్కడ ఉన్న భవనాలను సందర్శించి ఇదిగో అంటూ సెల్ఫీ లో టిడ్కో గృహాలను చూపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తమ ప్రభుత్వం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆళ్లగడ్డ కు 2200 టిడ్కో గృహాలను తీసుకొచ్చామన్నారు టిడిపి అధికారంలో ఉన్నప్పుడే టిడ్కో గృహాలు నిర్మాణం పూర్తి చేశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఒక్క లబ్ధి దారుడు కూడా టిడ్కో గృహాల్లో చేరలేదంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

టిడిపి ప్రభుత్వంలో పూర్తిచేసిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని వాటికి రంగులు వేసుకుంటూ మేము అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. లబ్ధిదారులకు గృహాలను అందించలేకపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప వైసిపి చేసిన అభివృద్ధి ఏమి లేదంటూ గొప్పలు మాత్రం చెప్పడంలో దిట్ట అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News