Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వై నాట్ పులివెందుల? భూమా అఖిలప్రియ

Allagadda: వై నాట్ పులివెందుల? భూమా అఖిలప్రియ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం  పాదయాత్ర ఉమ్మడి కర్నూల్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి గ్రామంలో ప్రవేశించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, టిడిపి యువ నాయకుడు భూమాజగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు. అనంతరం లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర ఒక పండుగ వాతావరణంలా కనబడుతుందన్నారు.  

- Advertisement -

రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నుండీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించుకుంటూ వస్తున్నామన్నారు. అదే విజయం మళ్ళీ కంటిన్యూ అవుతుందని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గెలవబోతున్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ రావాలని యువత పడే ఇబ్బందులు లోకేష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుర్తించారన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. నాయకుడిగా ఆయనను గెలిపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సమస్యల గురించి మాట్లాడుతూ సమస్యలు రాష్ట్రం  అంతటా ఆళ్లగడ్డ నుండి అమరావతి వరకు అన్ని సమస్యలే అన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో కచ్చితంగా గెలవబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ వై నాటు 175 అంటే.. తాము మేము కూడా వై నాట్ పులివెందుల అని అంటున్నామని అఖిలప్రియ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News