Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Allagadda: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి రైతును అన్నివిధాలా ఆదుకున్నాం

రైతుల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల నాని పేర్కొన్నారు. పట్టణంలోని చింతకుంట్లలో నిర్మించిన ప్రభుత్వ గోడౌను వారు భూమా కిషోర్ రెడ్డి విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ విజయసింహారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పలసాని మల్లికార్జున్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రైతే రాజుగా రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడ్పాటు అందించిందని రాష్ట్రంలో ప్రతి రైతును అన్ని రకాలుగా ఆదుకొందన్నారు. చింతకుంటలో గోడౌన్ నిర్మించడం మంచి పరిణామమని ఈ గ్రామంలో అత్యధికంగా రైతులు ఉన్నారని వారు పండించిన పంటను, ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిలువ ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటుందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News