Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Alur: ఎన్టీఆర్ వర్ధంతి..ఆలూరులో రక్తదాన శిబిరం

Alur: ఎన్టీఆర్ వర్ధంతి..ఆలూరులో రక్తదాన శిబిరం

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించాక రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News