Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Aluru: వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ పాదయాత్ర

Aluru: వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ పాదయాత్ర

దవతి ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్

ఆలూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వేదవతి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ వేదవతి ప్రాజెక్ట్ సాధన సమితి అధ్వర్యంలో గూల్యం నుంచి ఆలూరుకు పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలూరు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ చంద్రశేఖర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఎల్లార్తి మల్లికార్జున సురేంద్ర వేదవతి ప్రార్ధన సాధన కమిటీ సభ్యులు అర్జున్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి ఉంటే నేడు కరువు నుంచి ఆలూరు ప్రాంత ప్రజలకు విముక్తి కలిగేదని అన్నారు. ఆలూరుతో పాటు ఆదోని, ఆస్పరి, పత్తికొండ ప్రాంతాలకు కూడా సాగు త్రాగునీరు అందించే అవకాశం ఉండేది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News