Andhra Premier League 2025: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (Andhra Premier League 4) నాల్గవ ఎడిషన్ శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానుందని ఏపీఎల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సినీ నటుడు వెంకటేశ్ ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
ALSO READ : BCCI: బీసీసీఐకి మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సలహా..!
విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి లభిస్తుందని రంగారావు వెల్లడించారు. అండర్-16 క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించామని, ప్రతిభ చూపిన వారికి ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ మ్యాచ్లలో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించామని, మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వివరించారు.
ALSO READ : Shubman Gill: శుభ్మన్ గిల్ అరుదైన ఘనత.. ఏకంగా నాలుగోసారి ఆ ఐసీసీ అవార్డుకు ఎంపిక!


