Pawan Kalyan leaves Cabinet Meeting: ఉండవల్లిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు.
అంజనా దేవి ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె అనారోగ్యంతో మెగా ఫ్యామిలీ ఆందోళనలో ఉంది. కానీ అంజనా దేవి అనారోగ్యం మెగా కుటుంబ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. గతంలో కూడా వయసురీత్యా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. కొన్నిరోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంజనమ్మ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఉంటున్నారు. ఆమెకు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరు కుమార్తెలు సంతానం. అంజనా దేవిని కుటుంబసభ్యులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వీలు కుదిరినప్పుడల్లా తల్లితో సమయం గడుపుతూ ఉంటారు.
Pawan Kalyan: అంజనా దేవికి అస్వస్థత.. కేబినెట్ భేటీ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES