Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Annadata Sukhibhava Scheme: ఆగస్టు 2నుంచే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రారంభం

Annadata Sukhibhava Scheme: ఆగస్టు 2నుంచే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రారంభం

Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ఆగస్టు 2నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇందులో జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి అవసరమైన సూచనలు చేశారు.

- Advertisement -

రైతులకు నేరుగా ఆర్థిక మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం ద్వారా, ఒక్కొక్కరికి ఏడాదికి మొత్తం రూ.20,000 నగదు అందనుంది. ఈ మొత్తం మూడు విడతలుగా చెల్లించనున్నారు. మొదటి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.7,000 జమ కానుంది. ఇందులో రాష్ట్రం వాటా రూ.5,000 కాగా, కేంద్రం తరఫున పీఎం కిసాన్ పథకం ద్వారా మరో రూ.2,000 రానున్నాయి.

పీఎం కిసాన్ పథకం..

ఆగస్టు 2వ తేదీన ఈ మొత్తం విడుదల చేయనున్నారు. అదేరోజున కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా తో కలిపి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలిపారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2,342.92 కోట్లు కేటాయించింది. కేంద్రం ఈ ఏడాది మొదటి విడత కింద పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.831.51 కోట్లు అందించనుంది.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-liquor-scam-rs-11-crore-cash-seized-in-rangareddy-district/

పథకం ప్రారంభోత్సవం కోసం ప్రకాశం జిల్లా దర్శి పట్టణాన్ని కేంద్రంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 2న అక్కడే ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పథకాన్ని ప్రారంభించిన వెంటనే, మొదటి విడత నిధులు రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పథకంలో రాష్ట్రం ఇచ్చే మొత్తం రూ.14,000 కాగా, కేంద్రం తరఫున వచ్చే రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి రూ.20,000 లభించనుంది. పథకం అమలులో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతుల డేటాను అప్డేట్ చేయడంనుంచి, నిధుల విడుదల వరకు ప్రతీ దశను అధికారులు సమీక్షిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/dussehra-celebrations-to-begin-on-september-22-at-vijayawada-kanaka-durga-temple/

అన్నదాత సుఖీభవ పథకం..

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అధికారులు, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నారు. జిల్లాల వారీగా లబ్దిదారుల వివరాలను తుది స్థాయిలో పరిశీలించి, అవసరమైన అభ్యర్థితలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా, అన్నదాత సుఖీభవ పథకం వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించాలనే ఉద్దేశంతో రూపొందించారు. వరుసగా ఖరీఫ్, రబీ పంటల సమయంలో రైతులకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడేలా ప్రభుత్వం విడతల వారీగా నిధులను చెల్లించనుంది.

వీటితో పాటు, రైతులకు కావలసిన సహాయక వివరాలు అందించేందుకు ప్రభుత్వ శాఖలు మద్దతుగా నిలుస్తున్నాయి. పథకానికి సంబంధించిన సమాచారం గ్రామ సచివాలయాల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని త్వరగా పరిష్కరించేలా జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad