Wednesday, September 25, 2024
Homeఆంధ్రప్రదేశ్AP BRS: విభజన హామీలపై బీఆర్ఎస్ నిరసన

AP BRS: విభజన హామీలపై బీఆర్ఎస్ నిరసన

రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయంలో..

ఎపి విభజన హామీల సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి నేతలు పేర్కొన్నారు. గుంటూరులోని భారాస రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా- విభజన హామీల సాధన అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బి ఆర్ ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేత జె టి రామారావు మాట్లాడుతూ భారాస రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో ఎపి విభజన హామీల సాధనకై త్వరలో డిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని స్పష్టం చేశారు. షేక్ బాష మాట్లాడుతూ తమకు అధికారమిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ రాష్ట్ర ప్రజల్ని మోసగించిందన్నారు. టిడిపి, వైసీపీ పార్టీలు కేంద్రంలోని బిజెపి నేతల అడుగులకు మడుగులు వత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. . అబ్బు పుల్లారావు నాయుడు మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో సిఎం జగన్ ప్రజల్ని మోసాగిస్తూ తన రాజకీయ పబ్బం గడుపు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్తితిలో రాష్ట్ర ప్రజానీకముందని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ట శక్తుల చేతుల్లో పాశవికంగా హత్య గాయించబడ్డ పేదల పెన్నిధి వంగవీటి మోహన రంగ హత్య పై సిబిఐ విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షేక్ ఖాజావలి మాటాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో శాంతి బద్రతలు అదుపులో లేవన్నారు. పోలవరం నిర్మాణం చేపట్టి ఏళ్ళు గడుస్తున్నా ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల నాయుడు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టిడిపి, వైసీపీ పార్టీలు రెండూ వైఫల్యం చెందాయని ఆరోపించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి జరగాలంటే ఎపి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నేతలు గిద్దా శ్రీనివాస నాయుడు , కె. భాస్కర్ , కె.లక్ష్మి కమల,సైదావలీ, నళిని కాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News