Saturday, November 15, 2025
HomeTop StoriesCBN on Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట బాధాకరం.. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ...

CBN on Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట బాధాకరం.. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి

Kasibugga Stampede Updates: శ్రీకాకుళంలో కాశీబుగ్గలో ప్రమాద ఘటన జరిగింది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం, ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీ రద్దీ కారణంగా ఆలయంలోని రెయిలింగ్ ఊడిపోయి, భక్తులు కిందపడడంతో తొక్కిసలాట జరిగింది.

- Advertisement -

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడైంది. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తక్షణం స్థానిక ఆసుపత్రిలో చికిత్సకి తరలించారు. రోడ్డు విస్తరణ లేకుండా ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీఎం చంద్రబాబు స్పందన..

పవిత్ర కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చంద్రబాబు అన్నారు. భారీగా భక్తులు మరణించటం విషాదకరమన్న సీఎం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం తనను షాక్ కి గురిచేసినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏకాదశి రోజున ఇలా ప్రమాదం చోటుచేసుకోవటంపై బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఘటనపై పోలీసులతో పాటు ఇతర అధికారులతో ఆమె చర్చించారు. దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆమె ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad