Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP CM: జగన్‌ను కలిసిన రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా

AP CM: జగన్‌ను కలిసిన రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా

విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం

క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిశారు కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా. ఈ భేటీకి హాజరైన ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌. విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను ఆహ్వానించిన కె రహేజా గ్రూపు ప్రతినిధులు. విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం. మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్న కె రహేజా గ్రూప్‌. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రితో చర్చించిన కె రహేజా గ్రూపు ప్రతినిధులు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News