Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రివ్యూ

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రివ్యూ

పీఆర్సీ, ఇతర డిమాండ్లపై చర్చ

విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ, ఇతర అంశాలపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధన శాఖ ఉద్యోగులకు సంబంధిన పీఆర్సీ, ఇతర డిమాండ్లపై సమీక్షించారు.

- Advertisement -

ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఎండి జెన్కో చక్రధర్ బాబు, జెఎండి విజిలెన్స్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎపి స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జెఎసి అధ్యక్షులు పి.చంద్రశేఖర్,సెక్రటరీ జనరల్ పి.ప్రతాప్ రెడ్డి, వైయస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు జి.మహేశ్వర రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్.మల్లిఖార్జున రెడ్డి, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షులు పి.సాంబశివరావు, జనరల్ సెక్రటరి పి.నసుగుణాకర్ రావు, ఉద్యోగ సంఘాల ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News