Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP fiber net: 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు విశేష స్పందన

AP fiber net: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’కు విశేష స్పందన

త్వరలో ఫైబర్ నెట్ ద్వారా అందుబాటులోకి ఓటీటీ ప్లాట్ ఫామ్స్

ఫైబర్ నెట్ సెటప్ బాక్స్ లను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మూడవ అంతస్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో పి. గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ఏపీ ఫైబర్ కేబుల్ రాష్ట్ర ఎంఎస్ వో, ఎల్ సీవోలు భేటీ అయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఫస్ట్ డే ఫస్ట్ షోకు ప్రేక్షకుల స్పందన బాగుందన్నారు. త్వరలో ఫైబర్ నెట్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంఎస్ వోలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రైవేట్ సంస్థలకంటే ధీటుగా ప్రజలకు ఏపీ ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నామని స్పష్టంచేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలందరికీ బీఎస్ఎన్ఎల్ సహకారంతో ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సెటప్ బాక్స్ ల ధర ఎంత నిర్ణయించాలి, ఎన్ని సెటప్ బాక్స్ లు కొనాలన్న అంశంపై ఎమ్ ఎస్ వోలు, అధికారులతో చర్చిస్తున్నామన్నారు. కొత్త బాక్స్ లు కొనాలని ఆలోచన చేస్తున్నామన్నారు. వారంలో ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుందన్నారు. అవసరమైతే ప్రజలందరికీ తక్కువ ధరకు సెటప్ బాక్స్ లు అందజేస్తామని గౌతమ్ రెడ్డి అన్నారు.

సమావేశంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూధన్ రెడ్డి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఎమ్ ఎల్ వోలు, ఎల్ సీవోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News