Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Tollywood: విశాఖలో పలువురు సినీ ప్రముఖుల కీలక భేటీ

Tollywood: విశాఖలో పలువురు సినీ ప్రముఖుల కీలక భేటీ

థియేటర్ల బంద్ వ్యవహారం నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో పలువురు సినీ ప్రముఖులు(Tollywood) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, భరత్‌ భూషణ్‌, తదితరులు పాల్గొన్నారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. భేటీ అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

కాగా ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం విధితమే. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇండస్ట్రీ పెద్దలు సీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగానైనా కలిశారా ? అని మండిపడ్డారు. సినిమాలకు సంబంధించిన ఏ విషయంపైనైనా ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేప‌థ్యంలో తాజాగా విశాఖలో సినీ ప్ర‌ముఖులు స‌మావేశం కావ‌డంపై ప్రాధాన్యం ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News