Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Capital: అమరావతి అభివృద్ధికి ఎస్పీవీ, భూసేకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP Capital: అమరావతి అభివృద్ధికి ఎస్పీవీ, భూసేకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు వేగం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ప్రత్యేక, మెగా ప్రాజెక్టుల నిర్వహణ, అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు ₹50 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో చేపట్టే ప్రాజెక్టుల పనులను ఈ ఎస్‌పీవీ పర్యవేక్షించనుంది.

- Advertisement -

ఎస్‌పీవీ పరిధిలోకి గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (దీనికోసం సుమారు 5 వేల ఎకరాల భూమి అవసరం), స్మార్ట్ ఇండస్ట్రీలు, స్పోర్ట్స్‌ సిటీ, అలాగే రాజధానికి కీలకంగా భావించే ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు రానున్నాయి. వీటితో పాటు, అమరావతికి పర్యాటక ఆకర్షణగా నిలిచేలా నీరుకొండ కొండపై 600 అడుగుల ఎత్తులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం బేస్‌లో ఎన్టీఆర్ మ్యూజియం మరియు కన్వెన్షన్ సెంటర్ వంటివి ఉంటాయి.

మరోవైపు, రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ప్రభుత్వం భూసేకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్న భూములను భూసేకరణ చట్టం ప్రకారం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News